క్రికెట్‌ బెట్టింగ్‌..అప్పుల పాలై విద్యార్థి ఆత్మహత్య

-

ఐపీఎల్‌ క్రికెట్ బెట్టింగ్ మరో ప్రాణాన్ని బలిగొంది. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టున్న యువకుడు, అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేవ్ రాష్ట్రంవిజయవాడకు చెందిన వూరబింది సతీశ్ బాబు(20 years), సతీశ్ విజయవాడలో లయోలా కళాశాలలో డిగ్రీ చదువుతున్నాదు.

గత నెల రోజుల క్రితమే నగరానికి వచ్చి అశోక్ నగర్ లక్కీ బాయ్స్ హాస్టల్ ఉంటున్నాడు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లో తీవ్రంగా నష్ట పోయిన సతీశ్ అప్పుల పాలయ్యాడు. కొంత అప్పును కుటుంబ సభ్యులు తీర్చారు.మిగిత అప్పులు కట్టే దారి లేక పోవడంతో డిప్రెషన్కు గురైన సతీశ్ శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హాస్టల్ రూంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version