వనస్థలిపురంలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

-

మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ పరీక్షలలో పాస్ అయిన వారందరూ తమ తమ భవిష్యత్తు ప్రణాళికలలో మునిగిపోగా.. ఫెయిల్ అయిన వారు మాత్రం తమ జీవితాలు ఇక్కడితో ఆగిపోయాయని బాధలో ఉన్నారు. ఇక ఫెయిల్ అయిన వారిలో మనోధైర్యం తక్కువ ఉన్నవారు ఇక మా జీవితాలు అయిపోయాయని నిర్ణయించుకుని తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో 9 మంది బలవన్మరణానికి పాల్పడగా.. తాజాగా హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఇంటర్ విద్యార్థిని గాయత్రి ఇంట్లో ఉరివేసుకొని చనిపోయింది. ఇంటర్ మొదటి సంవత్సరం తప్పడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తన చెల్లెలు పాస్ అయ్యి.. ఆమె ఫెయిల్ కావడంతో మనోవేదనకు గురైన గాయత్రి ఈరోజు ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. హస్తినాపురం లోని నవీన కళాశాలలో చదువుతుంది గాయత్రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version