కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి..!

-

హైదరాబాద్ కోఠిలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండి.. వాటితో ప్రజలకేం సంబంధం అని ప్రశ్నించారు. ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉంది. అవినీతి పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా అని అడిగారు.

రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు విలీన డ్రామాలు వేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలు ఇవి. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పింది. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా.. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల్లో 40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి.. బడ్జెట్లో రూ.26 వేలు కేటాయించి.. చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా అని అన్నారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్ధమైనయని తెలిసే విలీన డ్రామాలాడుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారు అని బండి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version