తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే – ఈటెల రాజేందర్

-

కేసీఆర్ తన చెప్పు చేతల్లో ఉండే పోలీసులతో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభను అడ్డుకోవాలని చూసాడని మండిపడ్డారు హుజరాబాద్ ఎమ్మెల్యే, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్. బహిరంగ సభకు కోర్టు అనుమతి ఇచ్చిందని.. ఇంతపెద్ద పార్టీ బహిరంగ సభ 2 గంటలే ఉంటుందా? అని ప్రశ్నించారు.

కోర్టు ఎప్పుడూ కూడా ప్రజల పక్షానే ఉంటుందన్నారు ఈటెల. కేసీఆర్ పాలనలో చదువులమ్మ ఒడి అయిన బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు తమ హక్కుల కోసం ఉద్యమాన్ని చేశారని.. విద్యార్థుల ఉద్యమంతో కేసీఆర్ కొడుకు కేటీఆర్ దిగి వచ్చాడని అన్నారు. దానికి బాసర విద్యార్థులకు హ్యాట్సాఫ్ అన్నారు ఈటెల.

రెసిడెన్షియల్ స్కూల్స్ లో మంచి భోజనం పెట్టకపోవడం తో… బల్లులు పడ్డ అన్నం తిని, విద్యార్థులు అనారోగ్యం పాలై, హాస్పిటల్ కు వెళ్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అన్నారు. ప్రజలు నివురు గప్పిన నిప్పులా ఉన్నారని.. కేసీఆర్ ను ఓడగొట్టడమే మా ఎజెండా అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి… చేతలు మాత్రం గుమ్మం కూడా దాటవని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news