తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం..ఇకపై ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో ప్రచారం

-

తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ నెల 22న ఉదయం 7 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్ వారీగా ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో ప్రచారం నిర్వహించాలని బండి సంజయ్‌ కుమార్‌ ప్రకటన చేశారు అవినీతి మచ్చలేని గొప్ప వ్యక్తి నరేంద్రమోదీ.

అవినీతి మరక అంటకుండా అభివ్రుద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తూ పారదర్శకంగా పాలిస్తున్న మహానేత నరేంద్రమోదీ గారు. ఆయన కేబినెట్ లో ఒక్క మంత్రిపై కూడా అవినీతి మచ్చ లేదని వెల్లడించారు. మోదీ నిజంగా నీకు దోస్త్ అయితే…తెలంగాణ రాష్ట్రానికి అనేకసార్లు వచ్చారు. ఎందుకు కలవలేదు? ఢిల్లీకి అనేకసార్లు పోయినవ్ ఎందుకు కలవలేదు? అని నిలదీశారు. నీతి అయోగ్ మీటింగ్ జరిగితే అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరైతే… కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదు. ఎందుకంటే మోదీ పేరు వింటేనే కేసీఆర్ గజగజ వణుకుతడు. మోదీ వస్తేనే ఫాంహౌజ్ కు పారిపోయిన వ్యక్తి కేసీఆర్ అంటూ ఆగ్రహించారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version