MPTC, ZPTC ఎన్నికలపై బీజేపీ కీలక నిర్ణయం..!

-

రాష్ట్ర పదాధికారుల సమావేశం లో పలు అంశాల పై చర్చించి నిర్ణయం తీసుకున్నాం అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆగస్టు 7 న హర్ ఘర్ తిరంగ కార్యక్రమంపై జిల్లాలలో సమావేశం నిర్వహించి.. 8,9 తేదీల్లో మండలాల్లో మీటింగ్ లు జరపనున్నట్లు తెలిపారు. 10 ,11 తేదీల్లో స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాల క్లీనింగ్ అలాగే ఆగస్టు 11, 13 తేదీల్లో తీరంగా యాత్రలు చేపటనున్నట్లు పేర్కొన్నారు.

అలాగే రైతు రుణ మాఫీ అమలు కాకపోవడం పై రేపు ఎల్లుండి రచ్చ బండ కార్యక్రమాలు చేపడతాం. వరంగల్, హైద్రాబాద్ లో రైతు లతో భారీ బహిరంగ సభలు పెడతాం. లోకల్ బాడీ ఎన్నికలో అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నం. అలాగే MPTC, ZPTC ఎన్నికలకి సమాయత్తం కావాలని.. పార్టీ సభ్యత్వం పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నట్లు.. అదే విధంగా 3 ఎమ్మెల్సీ ఎన్నికలకి ఇప్పటి నుండే సిద్దం కావాలని అనుకున్నట్లు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version