ములుగులో పర్యటించనున్న ఎంపీ ఈటల రాజేందర్..!

-

తెలంగాణలోని అన్ని జిలాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాల వల్ల నదులు, వాగులు పొంగిపోయాయి. దీంతో చాలా చోట్ల లోతట్టు పాఠాలు ముంపుకు గురయ్యాయి. ముఖ్యంగా కొద్ది వర్షాలకే వరదలు వచ్చే ములుగును ఈశ్శ్రీ వరద ముంచేసింది. ఈ క్రమంలో నేడు ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్. ములుగు జిల్లా పస్రా, నార్లపూర్, జంపన్న వాగు వంటి వదర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు ఎంపీ ఈటల రాజేందర్.

అలాగే మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్. మహబూబాబాద్ బీజేపీ ఆఫీస్ లో మధ్యాహ్నం భోజనం అనంతరం మీడియా సమావేశం కూడా నిర్వహించనున్న ఈటల రాజేందర్.. అనంతరం నెల్లికుదురు, మరిపెడ మండలం పురుషోత్తయ గూడెం, సీతారాం తండాతో పాటు కరిపెల్లి మండలం గంగారాం తండాలో సైంటిస్ట్ అశ్విని ఇంటికి చేరుకోనున్నారు ఎంపీ ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version