నల్గొండ జిల్లాలో అడుగుపెట్టాలంటే రేవంత్ రెడ్డికి సీనియర్ల వీసా కావాలి – బూర నర్సయ్య గౌడ్

-

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ నేత సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాత కాంగ్రెస్, రేవంత్ కాంగ్రెస్, కేసీఆర్ కాంగ్రెస్ గా మూడు ముక్కలాటలా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో టిక్కెట్లు ఇప్పించి గెలిపించే బాధ్యత కెసిఆర్ తీసుకుంటారని ఆరోపించారు బూర నర్సయ్య.

పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ కాంగ్రెస్ అంతిమంగా బీఆర్ఎస్ లో కలుస్తాయన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అడుగుపెట్టాలంటే రేవంత్ రెడ్డికి సీనియర్ల వీసా కావాలని ఎద్దేవా చేశారు. సొంతంగా సభ నిర్వహించలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారని.. తెలంగాణా ఆకాంక్షలు నెరవేరేది బీజేపీ వల్లేనన్నారు. తెలంగాణాలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version