కూకట్ పల్లిలో దారుణం.. దోమల కోసం పెట్టిన పొగకి యువకుడి మృతి..!

-

దోమల నివారణ పెట్టే కాయిల్ ఒక నిండు ప్రాణాన్ని బలికొంది.. కూకట్పల్లి శివానంద రిహబ్లిటేషన్ హోమ్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే శివానంద రిహబిలిటేషన్ హోమ్ లో విమల అనే మహిళ ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తూ తన తల్లిదండ్రులతో ఒక క్వార్టర్లో నివాసం ఉంటోంది. గత శుక్రవారం రోజున రాత్రి తమ స్వగ్రామం బాపట్ల నుండి ఉన్నత చదువుల కోసం కోసం వచ్చిన తమ్ముడు తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్నారు, ఈ క్రమంలో దోమల నివారణకు ఉంచిన బత్తి మండి చుట్టుపక్కల ఉన్న వస్తువులకు అంటుకొని సిలిండర్ కు మంటలు అంటుకొని మంటలు వ్యాపించడంతో ఊపిరి ఆడక తమ్ముడు అభిషేక్ (27) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

35 శాతం కాలిన గాయాలతో పక్కనే ఉన్న రాందేవ్ రావు ఆసుపత్రిలో ఐ సి యూ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ అటు ఆసుపత్రి వర్గాలు కానీ, పోలీసులు కానీ, ఫైర్ ఉద్యోగులు గాని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. ఏది ఏమైనాప్పటికీ భవిష్యత్తు ఆలోచన దుస్ట్యా బాపట్ల నుండి ఉన్నత విద్య కోసం వచ్చిన యువకుడు చిన్న నిర్లక్ష్యానికి భలి అయ్యి ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచి వేసింది. ఇటువంటి సంఘటన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకోకుండా ఉండాలని అందరూ అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version