60 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ముందే ప్లాన్ చేసారు : జగదీష్ రెడ్డి

-

కేటీఆర్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని బ్రష్ లీడర్ జగదీష్ రెడ్డి అన్నారు. అయితే పోలీసుల ముందే ఈ దాడి జరిగింది. గోల్నాక నుంచి అశోక్ నగర్ వచ్చే విషయం వాళ్లకు ఎలా తెలిసింది. సిగ్నల్ అపి ట్రాఫిక్ జామ్ చేసి.. ఓ పథకం ప్రకారం దాడి చేశారు. ముందే అరవై మంది కాంగ్రెస్ కార్యకర్తలు రెడి గా ఉన్నారు. కేటీఆర్ కార్ మీదకు ఎక్కి దాడి చేశారు అని తెలిపారు.

అలాగే గత 3 నెలలుగా ఎక్కడ చూసినా BRS నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి. మొదట్లో BRS గ్రామ, మండల స్థాయి నాయకుల మీద దాడులు చేశారు. గత మూడు నెలలుగా సీనియర్ నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు హరీశ్ రావు ఇంటి మీద, ఖమ్మం లో మా నాయకుల మీద, కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడులు చేశారు.. ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద దాడి చేశారు. డీజీపీ, సీపీలు సిన్సీయర్ అయితే దాడి చేసిన నాయకుల మీద చర్యలు తీసుకోవాలి అని జగదీష్ రెడ్డి డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version