రేవంత్ డైవర్షన్ రాజకీయాలతో కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయ్ : జగదీష్ రెడ్డి

-

మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ అయ్యారు. కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయి. స్థాయిలేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆకతాయిలు చేసిన పనులకు కేటీఆర్ కు ఎం సంబంధం. రేవంత్ వెనకాల ఉండి… మంత్రులతో మాట్లాడిస్తున్నారు. సురేఖ మాటలు రాజకీయ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయి.

హామీల అమలులో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. హామీలు విఫలమై హైడ్రా, హైడ్రా విఫలమై సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారు. రేవంత్ డైవర్షన్ రాజకీయాలతో కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయ్. కోమటిరెడ్డి మానసిక స్థాయి సరిగ్గాలేదు. నేటి మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్సే. మూసీ ప్రక్షాళన కాదు… సీఎం మంత్రుల బుర్రలు ప్రక్షాళన చేయాలి. మూసీ మురికి కన్నా ఎక్కువ కలుషితమైన కాంగ్రెస్ ఆలోచనల సుందరీకరణ జరగాలి అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version