BREAKING : ఎమ్మెల్యేగా బీజేపీ నేత డీకే అరుణ ప్రమాణం.. ?

-

BREAKING : తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు బీజేపీ నేత డీకే అరుణ. బీజేపీ నేత డీకే అరుణతో పాటు రఘునందన్ రావు, రామచందర్ రావు, బండ కార్తీక రెడ్డి కూడా తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి కోర్టు కాపీలు అందించనున్నారు డీకే అరుణ. డికే అరుణ ను ఎమ్మెల్యే గా ప్రకటిస్తూ ఇటీవలే తీర్పు ఇచ్చింది కోర్టు.

కోర్టు ఆర్డర్ కాపీ లను ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చి వచ్చారు డికే అరుణ. కోర్టు తీర్పు ను అమలు చేసి తనను ఎమ్మెల్యే గా గుర్తించాలని కోరుతున్న డికే అరుణ… ఇందులో భాగంగానే…తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కాగా.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై 2018 అసెంబ్లీ ఎన్నికల్లో డీకే అరుణ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version