ఢిల్లీ వెళ్లని ఈటల, రాజ్ గోపాల్ రెడ్డి..బీజేపీ సీరియస్ ?

-

బీజేపీలో అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట నేతల మధ్య సమన్వయ లోపం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధిష్ఠానం.. అసంతృప్తి చల్లార్చే అంశంపై దృష్టి పెట్టింది.

ఈ క్రమంలోనే ఈటల, రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిచింది. అయితే… అధిష్టానం పిలిచినప్టపికీ… ఢిల్లీ వెళ్లడం లేదు కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్‌. ఈ తరుణంలోనే బండి సంజయ్ తో మాట్లాడిన కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్… హైదరాబాద్ లోనే ఉన్నారు. దీంతో రేపు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రానున్నారు. నాగర్ కర్నూల్ లో జరిగే మహా జనసంపర్క్ అభియాన్ బహిరంగ సభలో పాల్గొననున్న నడ్దా.. ఈ సందర్భంగా కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ లతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు కూడా చేయనున్నారు నడ్డా.

Read more RELATED
Recommended to you

Exit mobile version