బీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డి, రియల్టర్ పురుషోత్తంపై ఫోర్జరీ కేసు !

-

బీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డి , రియల్టర్ పురుషోత్తం నాయుడులకు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డి , రియల్టర్ పురుషోత్తం నాయుడులపై ఫోర్జరీ కేసు నమోదు అయింది. విజన్ రిసార్ట్స్ పార్ట్నర్ గంట రాజశేఖర్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు… పది సెక్షన్లు కింద కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి బెదిరించి సంతకాలు పెట్టాలని భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారట. తనకు తెలియకుండా డాక్యుమెంట్లు సృష్టించే తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేశాడట బాధితుడు. ఈ తరునంలోనే.. చల్లా ధర్మారెడ్డి తనను చంపుతామని బెదిరిస్తున్నారని మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారట బాధితుడు రాజశేఖర్ రావు. దీంతో చల్లా ధర్మారెడ్డి తో పాటు లెక్కల పురుషోత్తం నాయుడు, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారట మాదాపూర్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version