హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. 23వ తేదీన మంచినీటి సరఫరా బంద్

-

Fresh water supply bandh is required in Hyderabad city: హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ నగరంలో మంచినీటి సరఫరా బంద్ కానుంది. అయితే ఇది హైదరాబాద్ మొత్తం కాదని సమాచారం. కొన్ని ప్రాంతాలకు మాత్రమే.. మంచినీటి సరఫరా బంద్ కానుంది. ప్రసవన్ నగర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు ఉన్న పైప్ లైన్లకు.. మరమ్మత్తులు చేస్తున్నారు అధికారులు.

Fresh water supply bandh is required in Hyderabad city

ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాలలో ఈ నెల 23వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ తరుణంలో సిటీలోని హకీంపేట గోల్కొండ టోలిచౌకి, లంగర్ హౌస్ షేక్పేట్ జూబ్లీహిల్స్ ఫిలింనగర్ మాదాపూర్ కొండాపూర్ గచ్చిబౌలి ప్రాంతాలలో సరఫరా ఉండబోదని వెల్లడించింది. ఈ తరుణంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version