మెట్రోలో ప్రయాణించిన GHMC మేయర్..!

-

GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి తాజాగా మెట్రో లో ప్రయాణించారు. మూసరంబాగ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో ట్రైన్ లో ప్రయాణించారు మేయర్. ఈ క్రమంలోనే గణేష్ నిమజ్జనం కోసం భక్తులకి స్వాగతం పలుకుతూ పోస్టర్ ఏర్పాటు చేయాలని మెట్రో అధికారులను కోరారు మేయర్ విజయలక్ష్మి. అదే విధంగా నిమర్జనం రోజు భక్తులు రాత్రి ఎక్కువ సేపు బయట ఉంటారు.

కాబట్టి వారి సౌకర్యార్ధం రాత్రి ఎక్కువ సమయం వరకు మెట్రో రైలు నడపడంతో పాటుగా రాత్రి వచ్చే భక్తుల కోసం సరైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మేయర్ సూచించారు. అలాగే మెట్రో లో ప్రయాణం చేస్తూ ప్రయాణికులతో మాట్లాడి మెట్రో సేవలపై సౌకర్యాలను అడిగి తెలుసుకున్న మేయర్.. ప్రజల సూచనలు ఎప్పటికీ అప్పుడు తెలుసుకోవాలని మెట్రో అఫిషియల్ కి సూచించారు మేయర్ గద్వాల విజయ లక్ష్మి.

Read more RELATED
Recommended to you

Exit mobile version