రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయం..తెలంగాణకు క్యూ కట్టిన బిజెపి, కాంగ్రెస్ అగ్రనేతలు

-

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది.బిజెపి, కాంగ్రెస్ అగ్రనేతలు జిల్లాల్లో పర్యటించనున్నారు.ఈ నెల 5న పాలమూరుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రానున్నారు.బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన పాల్గొననున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 14న రాష్ట్రానికి రానున్నారు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లో నిర్వహించే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు.మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రెండు రోజుల టూర్ షెడ్యూల్ ఖరారైంది.ఈ నెల 6న వరంగల్లో జరగనున్న రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొననున్నారు.

మరుసటి రోజు హైదరాబాద్ లో పర్యటించనున్నారు.ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తో కలిసి రాహుల్ మాట్లాడే కార్యక్రమాన్ని, పీసిసి ఖరారు చేసింది.దీనికి రాష్ట్ర సర్కారు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేతలు కోర్టును ఆశ్రయించారు.ఓయూలో మీటింగ్ ను ఎలాగైనా నిర్వహిస్తామని చెబుతున్నారు.ఇవి కాక తెలంగాణణ అమరవీరుల కుటుంబ సభ్యులతో రాహుల్ లంచ్ కు ఏర్పాటు చేశారు.తర్వాత గాంధీభవన్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు.తమ నేతల పర్యటనలను విజయవంతం చేసేందుకు రెండు జాతీయ పార్టీలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news