భార్యపై నిఘా పెట్టి..ప్రియుడితో ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

-

ఆ దంపతులిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.వారిద్దరిదీ ప్రేమ వివాహం.పెళ్లయిన కొన్నాళ్లకు ఉద్యోగరీత్యా వేరువేరుగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఈ వ్యవహారాన్ని ఆమె కుటుంబ సభ్యులకు భర్త చెప్పినా పట్టించుకోలేదు.చివరికి వారు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన అతడు నిఘా వేశాడు.ప్రియుడితో భార్య ఉండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..ములుగు జిల్లా లోని దొడ్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చీమల సుమలత ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుంది.ఆమెకు చర్ల కార్యదర్శి పాయం పురుషోత్తం పరిచయం అయ్యాడు.కొన్నాళ్లకు వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడం తో పెళ్లి చేసుకోవాలని భావించారు.

ఇరువైపులా పెద్దలను ఒప్పించి 8 ఏళ్ల క్రితం ఒకటయ్యారు.ఆ తర్వాత ఇద్దరూ ఉద్యోగాల కారణంగా వేరు గా ఉంటూ వస్తున్నారు.ఈ క్రమంలో ఆమెకు తన ఇంటర్ క్లాస్ మేట్ లింగరాజు కనిపించాడు.అతడితో పెరిగిన సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారితీసింది.ఈ విషయమై పెద్దల్లో భర్త పంచాయితీ పెట్టించిన ఆమె మారలేదు.పైపెచ్చు ఆమె తల్లి పురుషోత్తం ని సవాల్ చేసింది.తన కుమార్తె కు అలాంటి అలవాట్లు లేవని, దమ్ముంటే నిరూపించాలని ఛాలెంజ్ విసిరింది.దీంతో పట్టుదలతో అతడు నిఘా పెట్టాడు.ఓ ఇంట్లో లింగరాజు, సుమలత సన్నిహితంగా ఉండగా పట్టుకున్నాడు.సుమలత కుటుంబ సభ్యుల సమక్షంలో వారిని పోలీసులకు అప్పగించాడు.

Read more RELATED
Recommended to you

Latest news