నాకు అన్యాయం చేయాలని చూస్తే మట్టి కొట్టుకుపోతారు – ఎమ్మెల్యే వనమా

-

భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. గత కొద్ది రోజుల నుంచి ఆయన రాజకీయాలనుంచి తప్పుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఆయన స్పందిస్తూ.. రాజకీయాలనుండి విరమించేది లేదని స్పష్టం చేశారు. గోబెల్స్ ప్రచారాలకు భయపడే వాడిని కాదన్నారు ఎమ్మెల్యే వనమా.

కెసిఆర్ ,కేటీఆర్, ప్రజల ఆశీర్వాదాలు, అభిమానం నాకు పుష్కలంగా ఉన్నాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆశీర్వాదంతో‌ మళ్లీ కొత్తగూడెం నుండి పోటీ చేస్తానని అన్నారు. నాలుగు సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడమే నా ధ్యేయం అన్నారు. నాకు అన్యాయం చేయాలని ఎవరైనా చూస్తే మట్టి కొట్టుకు పోతారని అన్నారు. కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల్లో ఉన్న భయం, నెలకొన్న సందేహం,అనుమానాలకు తెరదించేందుకే, అనివార్య పరిస్థితుల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news