తండ్రి కొడుకులను ట్యాంక్ బండ్ దగ్గర ఉరివేసినా తప్పులేదు – రేవంత్ రెడ్డి

-

తండ్రి – కొడుకులను ట్యాంక్ బండ్ దగ్గర ఉరివేసిన తప్పులేదని సీఎం కేసీఆర్, కేటీఆర్ పై మండిపడ్డారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచులు తలుచుకుంటే కెసిఆర్ ని బొంద పెట్టొచ్చు అన్నారు. ఇల్లు ఇల్లు తిరిగి ప్రజలకు కేసీఆర్ గురించి చెప్పాలని పిలుపునిచ్చారు. సర్పంచులు ఆత్మగౌరవంగా ఉండాలి అంటే.. కెసిఆర్ ప్రభుత్వం పోవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సర్పంచ్ ల హక్కులు కాల రాసే చట్టాలను రద్దు చేస్తామన్నారు. కెసిఆర్ తెచ్చిన చట్టాలను రద్దు చేస్తామని.. నిధులు ఇస్తామని అన్నారు. ఒక మొక్క చనిపోతే సర్పంచ్ ని సర్పంచ్ చేస్తా అంటున్న కేసిఆర్.. మరి మూసి లో 30 మంది కట్టుకు పోయారు దానికి ముఖ్యమంత్రిని ఏం చేయాలన్నారు. ఈ ఘటనతో మున్సిపల్ శాఖ మంత్రి చేతగానితనం బయటపడిందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచ్ల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news