సీఎం రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయాల్సిందే – కేఏ పాల్‌

-

సీఎం రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయాల్సిందే అంటూ వార్నింగ్‌ ఇచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌. నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారని… నన్ను చంపాలని చూస్తున్నారని బాంబ్‌ పేల్చారు. ప్రధాని మోడీ, అమిత్ షా లకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని.. నన్ను చంపాలని అనుకున్న వారే చచ్చి పోయారని వెల్లడించారు. నేను అందరికోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటానని ప్రకటించారు. కేసులు వేస్తున్నా..కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టే లు తీసుకువస్తున్నా అంటూ పేర్కొన్నారు.

ka paul on cm revanth reddy

కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. మోడీ, చంద్రబాబు, పవన్.. కాంగ్రెస్ లు నాకు శత్రువులు అన్నారు. గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళన పై కేఏ పాల్‌ స్పందించారు. వేలాది మంది గ్రూప్ వన్ అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అభ్యర్థులపై పోలీసు దాడులు బాధాకరమన్నారు. అభ్యర్థులను గాయపరచడం సరైందా అంటూ నిలదీశారు. పరిపాలన చాత కాకపోతే సిఎం రేవంత్ రెడ్డి రాజీనామా చెయ్యండి అంటూ ఫైర్‌ అయ్యారు. వేలమందినీ ఎందుకు కొడుతున్నారని కే ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version