కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ జరిగితే కచ్చితంగా జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ విషయం ఆటకెక్కించే కుట్ర జరుగుతుందని తెలిపారు ఎంపీ సంజయ్.

ప్రధానంగా రాజకీయాల ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై విచారణ జరుగకుండా ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. భారీగా డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తుంది. కేసీఆర్, కేటీఆర్ లను అనర్హులను ప్రకటించాలని.. స్పీకర్ కి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఫోన్ టయాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. సీబీఐని నిషేదిస్తూ.. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేసారు.

 

Read more RELATED
Recommended to you

Latest news