కెసిఆర్ పెద్ద అబద్దాలకోరు – రాజగోపాల్ రెడ్డి

-

మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కెసిఆర్ పెద్ద అబద్దాలకోరు అని ఆరోపించారు. ఆదివారం మునుగోడు లోని మసీదు గూడెంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ అబద్ధపు హామీలతో ప్రజలను వంచించారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు అని చెప్పి ఇప్పటివరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.

ఉప ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కి ప్రజలు గుర్తుకు వస్తారని.. లేకుంటే ఆయన ఫామ్ హౌస్ కే పరిగతం అవుతారని అన్నారు.అధికారం కోసం కేసీఆర్ ఎన్ని అబద్ధాలు అయినా చెబుతారని.. ఎవరినైనా మోసం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడిని అని చెప్పుకొనే కేసీఆర్ ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news