ఇవాళ సిరిసిల్లాలో కేసీఆర్ ప్రెస్ మీట్… సంచలన ప్రకటన చేసే ఛాన్స్

-

ఇవాళ సిరిసిల్లాలో కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండనుంది. ఈ సందర్బంగా కేసీఆర్ సంచలన ప్రకటన చేసే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే ఆయక దేనిపైన సంచలన ప్రకటన చేసే ఛాన్స్ ఉందొ తెలియాల్సి ఉంది. కాగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి కరీంనగర్ పయనం కానున్నారు. నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతులకు భరోసాకల్పించేందుకు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో పర్యటించనున్నారు.

ఇందులో భాగంగా…ఇవాళ ఉదయం 11:00 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుమ్ పూర్ గ్రామంలో ఎండిన పంట పొలాలను పరిశీస్తారు….రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజన కార్యక్రమం ఉంటుంది.అనంతరం…మధ్యాహ్నం 2:00 గంటలకు బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పొలాలను పరిశీలిస్తారు. నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. సాయంత్రం 3:00 గంటలకు శాభాష్ పల్లి బ్రీడ్జి వద్ద మధ్యమానేరు ప్రాజెక్టు ను పరిశీలిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version