కేసీఆర్ మాటలు మోదీ నాయకత్వాన్ని బలపరిచేలా ఉన్నాయి – రేవంత్ రెడ్డి

-

సీఎం కేసీఆర్ పై కీలక ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఏం చెప్పారో.. అదే విషయాన్ని సీఎం కేసీఆర్ చెప్పడం చూస్తుంటే.. బిఆర్ఎస్, బిజెపి మధ్య ఉన్న బంధం తెలుస్తుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయాన్ని నమోదు చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అది పెద్ద గెలుపు కాదని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కేసీఆర్ మాటలు వింటుంటే మోడీ నాయకత్వాన్ని బలపరిచేలా, ప్రజల తీర్పును అవహేళన చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. కర్ణాటకలో జెడిఎస్ కి సహకరించి, హంగ్ తెచ్చి, రాజకీయాలలో చక్రం తింపాలని భావించిన కేసీఆర్ ఆలోచనలని కన్నడ ప్రజలు తుంగలో తొక్కారని అన్నారు. ప్రధాని మోదీ – తెలంగాణ సీఎం కేసీఆర్ వేరువేరు కాదని.. వారిద్దరూ ఒక్కటేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news