రైతుల నుంచి రోజుకి వేల కాల్స్ వస్తున్నాయి..!

-

11వ సారి ఎర్రకోట పై మోడీ జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలి అని బీజేపీ రాష్ట్ర పదాదికారుల సమావేశంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఏ ఒక్కటి అమలు చేయలేదు. రాష్ట్ర కార్యాలయం లో రుణ మాఫీ కి సంబందించిన కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. రోజు వేల సంఖ్యలో రైతులు కాల్స్ చేస్తున్నారు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మాకు రుణమాఫీ కాలేదు … ఎవరు సహాయం చేయట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ ప్రాతిపాదికన రుణ మాఫీ చేస్తున్నారో అర్థం కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్స్ మాట్లాడటానికి మొదట్లో ఒక్కరినీ పెట్టాం. రైతుల నుంచి రోజుకి వేల కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆరుగురిని పెట్టిన కాల్స్ లిఫ్ట్ చేయడానికి టైం సరిపోవట్లేదు. వచ్చే నాలుగున్నరెళ్ళు కష్టపడి పని చేయాలి. మనమీద ఆశతో ప్రజలు తెలంగాణలో 36 శాతం ఓట్లు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును సవాలుగా తీసుకొని అంకిత భావంతో పని చేద్దాం అని కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version