ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తోంది : కిషన్ రెడ్డి

-

ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అందరికీ ఆరోగ్యం, అందరికీ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, కళాశాల విద్యార్థులకు స్కూటీ ఇలా కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేకపోయిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ స్థాయి వర్కర్ల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

గత కేసీఆర్ ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టారో రేవంత్ కూడా అదే ఫాలో అవుతున్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పయనిస్తున్నారు. ఎమ్మెల్యేలను అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు కూడా మోసపూరితమైనవి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి మయమైన పార్టీలే. ఈ రెండు పార్టీలు దొందూ దొందే. అని కిషన్ రెడ్డి విమర్శించారు. మరోవైపు ఇదే కార్యక్రమంలో ప్రసారమైన మన్ కీ బాత్ ను కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనేక సామాజిక అంశాలపై ప్రస్తావించారని కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version