కేసీఆర్‌ సర్కార్‌ పై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసలు..సంక్షేమ పథకాలు అద్భుతం !

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసలు కురిపించారు. ఇవాళ జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జనగామ కొత్త కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ ను 33 జిల్లాల చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ కలెక్టరేట్లో కూడా సచివాలయాలు లేవు అని కొనియాడారు. ఆదాయం లేకున్నా రెండు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని సర్కారుపై ప్రశంసల జల్లు కురిపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ వచ్చింది.. మనం మనం పోట్లాడుకోవడం అని కోరా రు. తెలంగాణలో రాజకీయ నాయకుల మధ్య ఘర్షణలు వద్దని కోరారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.ఇలాంటి అభివృద్ధినే ముందు ముందు ఇంకా కొనసాగించాలని కోమటి రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news