నా తుది శ్వాస వరకు బీజేపీలోనే కొనసాగాలనుకున్నా.. కానీ..? : కోమటిరెడ్డి

-

తెలంగాణలో మునుగోడు కోసం, నా గెలుపుకోసం మోడీ గారి నమ్మకంతో బీజేపీలో ఉన్నాను. తెలంగాణలో దుర్మార్గ మైన ముఖ్యమంత్రిని గద్దె దింపాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని బలంగా నమ్మి కాంగ్రెస్ లో చేరనున్నట్టు వెల్లడించారు. మునుగోడులో అమిత్ షా సభ పెట్టారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం బాగుపడింది. నా తుది శ్వాస వరకు బీజేపీలోనే కొనసాగాలనుకున్నాను.. కానీ మునుగోడు నియోజకవర్గం ప్రజలు, నాయకులు కాంగ్రెస్ లోకి రండి.. తనతో పాటు పని చేసిన నాయకులు, సహచరులు, అధిష్టానం అందరి అభిప్రాయం మేరకు తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వెల్లడించారు.

పేదలకు, నిరుద్యోగులకు అండగా ఉంటాను. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో పాటు.. నీతిమంతమైన పాలన అందించడం కోసం.. బడుడు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని తెలిపారు. మునుగోడు అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు మునుగోడు నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని.. తన కొడుకును సీఎం చేసేందుకు ఆరాటపడుతున్నాడు. డబ్బు అధికారంతో మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. అధిష్టానం గజ్వేల్ లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే.. కేసీఆర్ కి రిటర్న్ గిప్ట్ ఇస్తానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version