BREAKING : ముందస్తు ఎన్నికలపై కేటీఆర్‌ కీలక ప్రకటన..మేం సిద్ధంగా ఉన్నామంటూ !

-

BREAKING : ముందస్తు ఎన్నికలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. పరోక్షంగా ముందస్తు ఎన్నికలు వస్తాయనే యాంగిల్‌ కేటీఆర్‌ తాజాగా స్పందించారు. ఇవాళ నిజామాబాద్‌ జిల్లాలో కేటీఆర్‌ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాటాడుతూ, ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. గెలుస్తామని వెల్లడించారు. నిజామాబాద్‌ లో అన్ని స్థానాలు గెలవాలని కోరారు.

అలాగే, దేశంలోనే విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టు నాలుగేళ్లలో నిర్మించామని.. లక్ష కి.మీ.ల పైప్‌లైన్ వేసి కోటి ఇళ్లకు మంచి నీరు అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమ విస్తరించామని కేటీఆర్‌ పేర్కొన్నారు.2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది విమర్శలు చేశారు..కేసీఆర్‌ అధికారం చేపట్టాక 24 గంటలు విద్యుత్‌ సరఫరా ఇస్తున్నాం’ అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news