కంప్యూటర్ ను కనిపెట్టింది రాజీవ్ కాదు చార్లెస్ బాబేజీ… చిట్టినాయుడు అంటూ కేటీఆర్ సెటైర్ !

-

కంప్యూటర్ ను కనిపెట్టింది రాజీవ్ కాదు చార్లెస్ బాబేజీ అని… రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు వేశారు. రాజీవ్ గాంధీ కారణంగానే కేటీఆర్ కు జాబ్ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి నిన్న పేర్కొన్నారు అయితే, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

ktr on revanth over computer

చిట్టినాయుడు సుభాషితాలు అని…పరువు తీశారు కేటీఆర్. కంప్యూటర్ ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబేజీ అని… Tata Institute of Fundamental Re search Automatic Calculator ( TIFRAC) వారు 1956లో ఇండియాలో తొలిసారిగా కంప్యూటర్ సేవలు ప్రారంభించారని గుర్తు చేశారు.

రాజీవ్ గాంధీ గారికి అప్పటికి 12 సంవత్సరాలు పూర్తయ్యాయని కేటీఆర్ వెల్లడించారు. ఎదో నోటికొచ్చింది వాగడం, ఆ తర్వాత దొరికిపోవడం ఎందుకు అని మండిపడ్డారు. నీకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్ వీటికి పరిమితం అయితే మంచిదమ్మా చిట్టి అంటూ ర్యాగింగ్ చేశారు కేటీఆర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version