నేడు తెలంగాణ భవన్ లో కేటీఆర్ కీలక సమావేశం

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం జరుగనుంది. తెలంగాణ భవన్ లో ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో విద్య వ్యవస్థ పై చర్చ ఉంటుంది.

KTR has an emergency meeting with MLAs at Telangana Bhavan today

విద్యా వ్యవస్థ లో ప్రభుత్వ విధానాలపై భవిష్యత్తు కార్యాచరణ,బిఆర్ఎస్వీ సభ్యత్వాలపై ప్రతినిధుల బృందం కు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. ఇక అటు గ్రూప్ 1 అభ్యర్థులను కలుస్తానని ప్రకటించారు కేటీఆర్. మాకు మీ మద్దతు కావాలని కేటీఆర్ ని కోరిన గ్రూప్స్ 1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు వారిని కలుస్తానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా గ్రూప్స్ అభ్యర్థులు కేటీఆర్ కి మెసేజ్ చేశారు. మమ్మల్ని మన్నించాలి, మీరు అశోక్ నగర్ రావాలి, మాకు మీ మద్దతు అవసరం ఉంది అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version