కేసీఆర్ వ్యవహారం..ప్రేమ ఒకరితో పెళ్లి ఇంకొకరితో అన్నట్టు ఉంది – మల్లిఖార్జున ఖర్గే

-

ఇవాళ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా కేసీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లికార్జున ఖర్గే. ప్రేమ ఒకరితో పెళ్లి ఇంకొకరితో అన్నట్టు ఉంది కేసీఆర్ వ్యవహారం అని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని కాదని వేరేవాళ్ల ప్రేమలో ఉన్నాడు.. కేసీఆర్ కుటుంబం అంతా సోనియా గాంధీని కలిసి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఏం జరిగిందో జరిగిపోయిందన్నారు ఖర్గే.

నేనే అనేది నా విధానం కాదు.. మనం అనేదే నా విధానం.. మనందరం కలిసి పని చేద్దామని వెల్లడించారు. నేనే అంటే ఒక్కరితో ఏం చేయలేం.. మీరు ముందు నడవండి నేను వెనకాల ఉంటా అనే వ్యక్తిని కాదు.. అందరం కలిసి నడుద్దామని ప్రకటించారు మల్లికార్జున ఖర్గే. మోడీ హయం లో ఉద్యోగం లేదు..ఉపాధి లేదు.. ఒక్క శాతం మంది దగ్గరే దేశ సంపద ఉందని ఆరోపించారు ఖర్గే. ఎనిమిది ఏండ్ల లో 7 లక్షల ఉద్యోగాలు పోయాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news