రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాలు..!

-

రిజిస్ట్రేషన్ మరియు స్టంపింగ్ అధికారులు ఏర్పాటు చేసిన ఇంటరక్టింగ్ మీటింగ్ లో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి.. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా అధికారులు అందరూ పారదర్శకంగా సేవలు అందించాలి అని సూచించారు. అలాగే అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ అవసరాలను త్వరలోనే ప్రభుత్వం క్లియర్ చేస్తాము అని పేర్కొన్నారు.

అదే విధంగా రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను ప్రస్తావించారు మంత్రి పొంగులేటి. ప్రస్తుతం త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని.. దీని కింద అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండు సంవత్సరాలలో ప్రభుత్వ భవనాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయి అని అన్నారు. అలాగే 2014లో 2,746 కోట్ల రూపాలుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గతేడాది 14,588 కోట్ల రూపాలుకు చేరుకుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version