రాజకీయాలకు సంబధం లేకుండా వరద బాధితులకు మోడీ ప్రభుత్వం సహకారం అందిస్తుంది : ఈటల రాజేందర్

-

రాజకీయాలకు సంబధం లేకుండా వరద బాధితులకు మోడీ ప్రభుత్వం సహకారం అందిస్తుందని మల్కాజ్ గిరి ఎంపీ, బీజేపీ సీనియర్ నేత  ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలకు బీజేపీకి అండగా నిలుస్తోందని తెలిపారు.  చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. పంటలు బాగా దెబ్బతిన్నాయి. కొట్టుకుపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా  ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో మొక్క జొన్న పంట చేతికి వచ్చే సమయంలో భారీగా దెబ్బతిన్నది.  ఇల్లు కూలిపోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నాం. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ వారికి ఆర్థిక సహకారం అందించాలి.  ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటున్నాను.  బీజేపీ కార్యకర్తలుగా తోడుగా నిలుస్తామని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version