మూసీ సుందరీకరణ కాదు.. పునరుజ్జీవనం : సీఎం రేవంత్ రెడ్డి

-

మూసీ ప్రాజెక్ట్ పై ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నది పునరుజ్జీవనానికి బ్యూటిఫికేషన్ అనే కాస్మొటిక్ యాడ్ చేశారు. సుందరీకరణ ఎవరికీ కావాలి..? మేము చేస్తోంది కాలుష్య రహిత నగరం. మేము అందాల కోసం పని చేయడం లేదు. మీకు అలాంటి ఆలోచన విధానం ఉందేమో నాకు తెలియదు అన్నారు. ప్రజలందరికీ తెలుసు అన్నారు.

మూసీ పై మీరు ఎందుకు విషం చిమ్ముతున్నారో చెప్పండి. ప్రజాస్వామ్యం ప్రతిపక్షాలు మాట్లాడాలనే ఉద్దేశం మాది. వాళ్లు  చేసిందే గొప్ప అంటే ఎలా..? మూసీ సుందరీకరణ అని అసలు ఎవరూ చెప్పారు. మూసీ సుందరీకరణ కాదు.. పునరుజ్జీవనం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరూ మెదడులో మూసీ మురికి కంటే ఎక్కువ విషం నింపుకొని దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తాము ఉన్నపళంగా, నిర్ధయగా ఎవ్వరినీ ఖాళీ చేయించడం లేదని.. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించి.. రూ.25వేలు ఇచ్చామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version