కడియం శ్రీహరిపై మోత్కుపల్లి వివాదస్పద వ్యాఖ్యలు..

-

కడియం శ్రీహరిపై కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం పదవి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కూతురుకి ఎంపీ టికెట్, డబ్బులు అన్ని తీసుకొని బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు.. ఇదేం నియ్యతి అంటూ ఆగ్రహించారు కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు.

కడియం శ్రీహరి మాల కాదు మాదిగ కాదు వాళ్ల నోటి కాడా ముద్ద లాక్కుంటున్నాడు అని ఆయన మీద విచారణ చేయాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన్ని సంకన ఎక్కించుకున్నాడని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు. రేవంత్ రెడ్డి దొర అని ఆగ్రహించారు. రేవంత్ రెడ్డికి ఎంతసేపూ పైరవీకార్లు, డబ్బున్న వాళ్లే కావాలి.. రంజిత్ రెడ్డిని వాడు కోడిగుడ్లు అమ్ముకునేటోడు, బోడగుండు అని తిట్టి మళ్లీ పార్టీలోకి చేర్చుకున్నాడు రెడ్డి దొర అంటూ విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version