తెలంగాణలో మా టార్గెట్ 14 సీట్లు : సీఎం రేవంత్ రెడ్డి

-

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డబుల్ డిజిట్ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. ఈ ఎన్నికల్లో మా లక్ష్యం 14 సీట్లు అన్నారు. రాష్ట్ర ప్రజల గురించి మాకు తెలుసు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసిందని.. డోర్లు క్లోజ్ చేసి బిల్ పాస్ చేశారని గతంలో బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని మోడీ అన్నారు. వీటిని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ పై విమర్శలు చేసిన మోడీకి ఓట్లు అడిగే హక్కులేదన్నారు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

cm revanth reddy

ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి పేరుతో మోడీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. అలాంటి వారే అసలైన హిందువులు. బజార్ లో దేవుడి బొమ్మ పెట్టి ఓట్లు అడుక్కునేావారు బిచ్చగాడు అవుతాడు తప్ప భక్తుడు కాడు. బస్టాండ్ లో దేవుడి బొమ్మలు పెట్టుకొని బిక్షం ఎత్తినట్టు బీజేపీ వాళ్లు ఓట్లు అడుక్కుంటున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version