ఇవాళ BRS లో చేరనున్న పొన్నాల లక్ష్మయ్య

-

మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఇవాళ భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని ఉన్నారు పొన్నాల లక్ష్మయ్య. జనగామ వేదికగా ఈ చేరిక జరగనుంది.

Ponnala Lakshmaiah will join BRS today

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జనగామ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్. ఈ తరుణంలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య చేరనున్నారు.

గత మూడు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. జనగామ కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ… రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు పొన్నాల లక్ష్మయ్య. తదనంతరం భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు పొన్నాల లక్ష్మయ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version