తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తా – ప్రియాంక గాంధీ

-

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ నిన్న తెలంగాణ నేతలతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మునుగోడు, కోమటి రెడ్డి ఇష్యూపై ప్రియాంక గాంధీ చర్చించారు. అయితే.. ఈ సమావేశం అనంతరం.. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తానని ప్రకటించారు. ఎవరైనా నన్ను కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని స్పష్టం చేశారు.

మీరు కలిసి పని చేస్తే మీకే లాభం, పార్టీ అధికారంలోకి రాకపోతే మాతు పాటు మీరంతా నష్టపోతారని తేల్చి చెప్పారు ప్రియాంకా గాంధీ. అందరూ కలిసి పని చేయాలని.. మునుగోడులో విజయం సాధించాలని కోరారు. కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి తో మాట్లాడే బాధ్యత ను దామోదర రాజనర్సింహ.. యాష్కీ లకు అప్పగించారు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ. అలాగే..మునుగోడు అభ్యర్ధి ఎంపిక పై ఏఐసీసీ కార్యదర్శులు ఇవాళ్టి నుండే కసరత్తు చేయాలని ప్రియాంకా గాంధీ ఆదేశించగా.. జిల్లా నాయకుల అభిప్రాయాలు సేకరించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news