‘రేవంత్‌ అన్నా మీతో మాట్లాడాలి’.. ఒక్క పిలుపుతోనే సమస్య పరిష్కరించిన సీఎం

-

తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు నిర్ణయాలతో సంచలనం రేకెత్తించారు. ఇక తాజాగా ఆయన మాజీ సీఎం కేసీఆర్​ను పరామర్శించేందుకు హైదరాబాద్​లోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఆయన ఆస్పత్రికి వెళ్లిన సమయంలో అక్కడ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. “రేవంత్‌ అన్నా.. మీతో మాట్లాడాలి’’ అంటూ ఓ మహిళ అభ్యర్థించగా.. వెంటనే సీఎం స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించి వెళ్తుండగా.. తమ సమస్యను పరిష్కరించాలని సదరు మహిళ సీఎంను కోరగా వెంటనే స్పందించారు. ఆమె దగ్గరకి వెళ్లి సమస్య ఏంటో చెప్పాలని.. తన పాపకు ఆస్పత్రికి సంబంధించిన ఖర్చు చాలా అవుతుందని.. కొంచెం సాయం చేయాలని కోరారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version