BJP మత రాజకీయాలకు, BRS కుట్ర రాజకీయాలకు “చెంపపెట్టు” కర్ణాటక ఫలితాలు – షర్మిల

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైఎస్‌ షర్మిల స్పందించారు. BJP మత రాజకీయాలకు, BRS కుట్ర రాజకీయాలకు “చెంపపెట్టు” కర్ణాటక ఎన్నికల ఫలితాలు అని వెల్లడించారు. ప్రజలను అమాయకులను చేసి, స్వార్థ రాజకీయాలకు పాల్పడితే ఇలాంటి తీర్పే వెలువడుతుందని తెలిపారు షర్మిల.

కులం, మతం, డబ్బు, అధికారమదంతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరు. నియంత పాలనను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం సైతం ఎదురుచూస్తోందని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా.. అంతకు ముందు కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. KCR హంతకుడు! ఒకేరోజు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు. డిగ్రీ చదివి నాలుగేండ్లయినా ఉద్యోగం రాక శివకుమార్ ఉరి వేసుకున్నాడు. 20 రోజులైనా వడ్లకు కాంటాలు వేయక రైతు యల్లయ్య గుండె ఆగింది. 15రోజులుగా సమ్మె చేస్తున్నా.. సర్కారు స్పందించక జీపీ కార్యదర్శి సోనీ తనువు చాలించిందని ఫైర్‌ అయ్యారు షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version