కేటీఆర్‌ భార్య కూడా ఏపీ వ్యక్తినే – షర్మిల సంచలన వ్యాఖ్యలు

-

మంత్రి కేటీఆర్‌ భార్య కూడా ఏపీకి చెందిన వ్యక్తి అని వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏపీ వ్యక్తి అయితే, నేను కూడా ఏపీ వ్యక్తినేనని చురకలు అంటించారు. తాను తెలంగాణలోనే పుట్టి, పెరిగానని వెల్లడించారు షర్మిల. TRS దౌర్జన్యాలు, దాడులు.. పోలీసుల ఏకపక్ష వైఖరిపై ఈ రోజు రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై గారికి వివరించడం జరిగిందని షర్మిల చెప్పారు.

ఈ దాడిపై హోంశాఖ, డీజీపీ కార్యాలయాల నుంచి నివేదిక కోరాలని విన్నవించాను. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకే లేకుండా టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని చెప్పడం జరిగిందన్నారు షర్మిల. పాలకపక్ష ఆగడాలు పతాక స్థాయికి చేరినపుడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దాడులకు పాల్పడినపుడు పార్టీలకు అతీతంగా నిలదీయడం అందరి కర్తవ్యమని స్పష్టం చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news