వేణు స్వామికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు !

-

తెలుగు రాష్ట్రాల్లో తన జాతకాలతో అతి తక్కువ కాలంలో చాలా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఇతరుల జాతకాలు చెప్పడంలో బిజీగా ఈయన పండితుడు.. తన జాతకం చూసుకోవడం మర్చిపోయినట్టున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ తర్వాత వాళ్లిద్దరు కలిసి ఉండలేరు. పెళ్లి తర్వాత విడిపోతారు అని కామెంట్స్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది.

అయితే వేణు స్వామి పై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు తన ముందు హాజరు కావాలని గతం లో వేణుని ఆదేశించింది మహిళా కమిషన్.  హిళా కమిషన్ కు ఆ అధికారం లేదంటూ స్టే తెచ్చుకున్న వేణు స్వామి. ఈ రోజు ఆ స్టే ఎత్తివేస్తూ మహిళా కమిషన్ కు పూర్తిఅధికారాలున్నాయని పేర్కొంటూ హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా వారం రోజుల్లో వేణు స్వామిపై తదుపరి చర్యలు తీసుకోవాలని కమిషన్ ను ఆదేశించింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version