వేములవాడలో తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఘోర అవమానం

-

వేములవాడలో తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఘోర అవమానం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని సద్దుల బతుకమ్మ వేడుకల్లో నిన్న గవర్నర్ తమిళ్ సై పాల్గొన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల సభా వేదిక వద్ద గవర్నర్ కు స్వాగతం పలికి, ఉన్నట్లు ఉండి.. సభా స్థలం నుండి వెళ్లిపోయారు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే చెన్నేమనేని రమేష్ బాబు.

ఎమ్మెల్యే రమేష్ బాబు వెంటనే మున్సిపల్ చైర్మన్ ఇతర టి ఆర్ యస్ నాయకులు కూడా వెళ్లి పోయారు. దీంతో తెలంగాణ గవర్నర్ తమిళిసై…ఒంటరిగానే బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మూలవాగు వద్ద బతుకమ్మ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్.. అనంతరం మాట్లాడారు.

అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా దర్శించుకోవడం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వెయ్యి సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కాపాడుకోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలి… ఆలయ అభివృద్ధి కోసం నా వంతు నేను కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news