రైతు భరోసా కాదు.. సీఎం కుర్చీకే భరోసా లేదు.. కేటీఆర్ సెటైర్లు..!

-

హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం కు చిత్తశుద్ది ఉంటే అందరికీ ఒకటే న్యాయం  చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో 10 చోట్ల ఉప ఎన్నికలు తప్పవని.. డ్రామాలతో ఎక్కువ కాలం రాజకీయం నడవదు అన్నారు. మేము నిర్మాణాలు చేస్తే.. కాంగ్రెస్ వాటిని కూల్చుతుందన్నారు. రైతు భరోసా కాదు.. సీఎం కుర్చీకే భరోసా లేదని సెటైర్లు వేశారు కేటీఆర్.

మరోవైపు తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏం పాపం చేసిందని.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని ప్రశ్నించారు కేటీఆర్. మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివి ప్రదర్శించవద్దని హెచ్చరించారు కేటీఆర్. ఇద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని మాట్లాడారు. ఎమ్మెల్యేలకు కండువా కప్పిన సన్నాసి ఎవరు అని ప్రశ్నించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version