BREAKING : కార్మికులకు షాక్‌… ఇవాళ అసెంబ్లీలో లేని ఆర్టీసీ బిల్లు..!

-

ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఇక ఇవాళ ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. మొదట జీరో అవర్ జరుగనుంది. అనంతరం కాగ్ రిపోర్టును సభలో ప్రవేశ పెట్టనున్నారు మంత్రి హరీష్ రావు. అలాగే.. మరో ఐదు ప్రభుత్వ బిల్లులు కూడా కేసీఆర్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది.

అనంతరం 9 ఏళ్ల తెలంగాణలో అభివృద్ధి పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. అటు ఇవాళ 11.30 గంటలకు అసెంబ్లీకి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం.. తెలంగాణ అభివృద్ధిపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో సమాధానం ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. దాదాపు 2 గంటల పాటు.. సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. అయితే… ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో.. ఆర్టీసీ బిల్లుపై చర్చ లేదని సమాచారం అందుతోంది. గవర్నర్‌ ఇంకా ఆమోదం తెలపకపోవడంతో..ఆర్టీసీ బిల్లుపై చర్చ లేదని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version