ఇది ముమ్మాటికి కిసాన్ బర్బాత్ సర్కార్ – వైఎస్ షర్మిల

-

టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్ ఎక్కడ? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ కిసాన్ బర్బాద్ సర్కారేనని అన్నారు షర్మిల. అకాల వర్షంతో రాష్ట్రంలో 9 లక్షల ఎకరాలకుపైగా పంటనష్టం జరిగిందని.. ప్రభుత్వం లెక్కలు మార్చి చెబుతున్నా ఇప్పటికీ రైతులకు రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదని మండిపడ్డారు.

మరోవైపు అక్కడక్కడా తెరుచుకున్న ఐకేపీ సెంటర్లలో వడ్లు తడుస్తున్నా కొనుగోలు జరగటం లేదన్నారు. మిల్లర్లు రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో ఐకేపీ సెంటర్లు తెరిచి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పంటనష్టపోయిన రైతులకు కనీసం ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news