BREAKING : ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ !

-

BREAKING : ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు ఏపీ, తెలంగాణ లో పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని వత్సవాయి మండలం లింగాల వద్ద మునేటి బ్రిడ్జిపై ప్రవహిస్తోంది నీరు.

దీంతో తెలంగాణలోని వైరా, ఆంధ్రలోని జగ్గయ్యపేటకు నిలిచిపోయాయి రాకపోకలు. భారీగా వరద నీరు రావడంతో మునేటి పరిసర ప్రాంతాల్లో అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. మున్నేరులో గంటగంటకు వరద పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు.

మరోవైపు రానున్న మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version