తెలంగాణాలో విషాదం.. కరెంట్​ పోల్​ విరిగి పడి బాలుడు మృతి

-

Tragedy in Telangana Current pole broke and boy died: తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు స్తంభం పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల్ లో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో సంగమేశ్వర కాలనీలో కరెంటు పోలు… తీగలపై చెట్టుకొమ్మలు పడుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులకు స్థానికులు కంప్లైంట్ చేయడం జరిగింది.

Tragedy in Telangana Current pole broke and boy died

ఈ తరుణంలోనే ఆదివారం రోజున కరెంటు సప్లై నిలిపివేసి చెట్లు కొట్టడం మొదలుపెట్టారు అధికారులు. అయితే ఈ తరుణంలోనే కరెంటు స్తంభం పాతది కావడంతో… ఆ స్తంభం కాస్త విరిగి మహేష్ అనే నాలుగు సంవత్సరాల బుడ్డోడు పైన పడింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ తరుణంలోనే అలర్ట్ అయిన స్థానికులు వెంటనే ఆ బాలుని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిషించేసరికి ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఇంకా ఈ సంఘటనపై… కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version